Wednesday, May 1, 2024

TS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ భాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా స్పీకర్ పదవిని చేపట్టిన గడ్డం ప్రసాద్ ను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, అలాగే ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యే లు మాట్లాడారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా వేశారు.

కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్ లో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంపై కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement