Friday, May 3, 2024

Suspension – పేకాటరాయళ్ల నుంచి లంచం డిమాండ్… తెలకపల్లి ఎస్సై సస్పెండ్ ..

నాగర్ కర్నూల్ ప్రతినిధి : పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురిని కేసు నుంచి తప్పిస్తానంటూ రూ.60 వేలు డిమాండ్ చేసిన ఎస్సై పై సస్పెండ్ వేటు పడింది.. వివరాల్లోకి వెళితే.. గతేడాది డిసెంబర్ 27న నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామ శివారులో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ.. తెలకపల్లి పోలీసులకు చిక్కారు. కాగా, ఆ కేసు నుంచి తప్పిస్తానంటూ తెలకపల్లి ఎస్సై వసురాం నాయక్, మరో కానిస్టేబుల్ బాధితుల నుంచి రూ.60 వేలు లంచం డిమాండ్ చేశారు. కాగా, డబ్బు ఇచ్చుకోలేక బాధితులు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌కు సదరు ఎస్సైపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ అనంతరం వసురాం నాయక్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ కు మెమో జారీ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement