Friday, May 17, 2024

క్రీడలతో మానసిక ఉల్లాసం … రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి

నిర్మల్ టౌన్ 29 ఆగస్టు ప్రభా న్యూస్ జాతీయ క్రీడల దినోత్సవం సందర్బంగా నిర్మల్ పట్టణం, NTR మినీ స్టేడియం లో జిల్లా స్థాయి యోగ పోటీలను మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొని మంత్రి తో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ , మాజీ డిసిసిబి చైర్మన్ కోరిపెల్లి రాంకీషన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంత‌రం ఆహుతులు విద్యార్థులు చేసిన యోగాస‌నాలను తిలకించారు. విద్యార్థులను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో
పాకాల రామచందర్ హజ్ కమిటీ సభ్యులు యం.డి.నజీరోద్దీన్, కౌన్సిలర్ సలిమ్,మాజీ కౌన్సిలర్ అకోజి కిషన్,జాగృతి అధ్యక్షులు లక్ష్మణాచారి,డా.కృష్ణంరాజు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement