Monday, May 6, 2024

HYD: కళ్ల ముందున్న అభివృద్ధిని చూసి.. మరొకసారి ఆశీర్వదించండి.. మంత్రి సబిత

కళ్ళ ముందున్న అభివృద్ధిని చూసి, కంటి ముందు అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి మరొకసారి ఆశీర్వదించాలని తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చందనం చెరువు సమీపంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి వచ్చిన వాకర్స్ తో మాటామంతి నిర్వహించారు.


అందరినీ మర్యాదపూర్వకంగా పలకరించి అభివృద్ధి చేశాను.. ఆదరించండి.. తాను మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలుచున్నాను.. కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement