Friday, May 17, 2024

ధాన్యాన్ని రోడ్లపై అరబోయకండి: సంగారెడ్డి ఎస్పీ

రైతులు తాము పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయొద్దని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై అరబోసి ధాన్యం చుట్టూ   రాళ్ళు పెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు ధాన్యాన్ని కల్లాల్లో అరబోయాలని సూచించారు. ప్రమాదాల కారణంగా కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. రోడ్డుపై ధాన్యాన్ని అరబోయటం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగితే సంబంధిత రైతులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ రమణ కుమార్ హెచ్చరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement