Friday, May 3, 2024

TS : సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

చౌట్కూర్ : సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చౌట‌కూర్ మండ‌లం శివంపేట బీర్ ఫ్యాక్ట‌రీ వ‌ద్ద ద్విచ‌క్ర వాహనాన్ని గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్టింది. ఈఘ‌ట‌న‌లో ద్విచ‌క్ర వాహ‌నంపై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక్క‌డే మృత్యువాత ప‌డ్డారు.

టేక్మాల్ మండలం మల్కాపూర్ తాండకు చెందిన లాకావత్ శీను, అల్లాదుర్గం మండలం ముప్పారం తాండకు చెందిన నేనావత్ అశోక్ లు ఇద్దరు బావ బామ్మర్దులు కలిసి కూలి పని కోసం సంగారెడ్డికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా శివంపేట బీర్ ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వారు ఒకరికి అక్కడే మృతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, పుల్కల్ ఎస్ఐ శ్రీకాంత్ చేరుకొని వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డికి అంబులెన్స్ తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement