Thursday, May 2, 2024

TS: జ‌న‌గామ‌ అద‌న‌పు కలెక్ట‌ర్ కు రేవంత్ ప్ర‌శంస‌లు..

రైతులను మోసం చేసిన ట్రేడర్లపై క్రిమినల్ కేసులు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శి సస్పెండ్
అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌కు క్విక్ యాక్ష‌న్ కు
అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్

హైద‌రాబాద్ – రైతులను మోసం చేసిన వారిపై జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కేసులు పెట్టించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘జనగామ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి… రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించిన… నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ గారికి నా అభినందనలు’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్‌లో ప్రశంసించారు.

రైత‌న్న‌ల‌ను మోసం చేస్తే స‌హించేది లేదు… రేవంత్
కాగా, ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement