Friday, May 3, 2024

TS: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఊరట

సుప్రీంకోర్టులో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట లభించింది. మహిపాల్ రెడ్డిపై పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యం చేశారని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విచారణ ను జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం చేసింది.

మహిపాల్ రెడ్డిపై హైకోర్టును తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యంగా సవాల్ చేసిన కారణంతో తోసిపుచ్చింది ధర్మాసనం. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పింది ధర్మాసనం. దీంతో సుప్రీం కోర్టులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement