Friday, May 17, 2024

BRS: మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రావులను కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994, 2009 ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్ర‌భుత్వ విప్‌గా ప‌ని చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ఎన్నిక‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement