Sunday, April 28, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రంజిత్ రెడ్డి… జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీ

వికారాబాద్, ఆగస్టు 15 ( ప్రభ న్యూస్): రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని, పెబెల్ సిటీ గెటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

దేశంలోనే ఆదర్శంగా చీమలదరి గ్రామపంచాయతీ.. ఎంపీ రంజిత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రప్రథమంగా మోమిన్ పేట మండలం చీమలదరి గ్రామపంచాయతీలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించడం అభినందనీయమని, జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైన గ్రామ సర్పంచ్ నరసింహరెడ్డి అభినందనీయులని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైన చీమలదరిలో ఉచిత వైఫై సేవలు అందించడం అభినందనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్, గ్రామ సర్పంచ్ నాసంపల్లి నరసింహారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

- Advertisement -

రాష్ట్రంలోని 12,000 పైచిలుకుగా ఉన్న గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఈ గ్రామం భారతదేశంలో ఆదర్శ గ్రామపంచాయతీగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రామ సర్పంచ్ నాసన్పల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ… ఎంపీ, ఎమ్మెల్యే కృషి కారణగా గ్రామానికి పూర్తిస్థాయిలో వైఫై కనెక్షన్ ఇవ్వడం జరిగిందని, గ్రామస్తుల సహకారం అధికారుల సహకారం పూర్తిగా లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ రెడ్డిని శాలువాతో అభినందించడంతో పాటు గ్రామ కార్యదర్శి సుగుణను గ్రామపంచాయతీ వార్డు సభ్యులను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement