Monday, May 6, 2024

RR: ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.. అదనపు కలెక్టర్

వికారాబాద్, జనవరి 25 (ప్రభ న్యూస్): జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓటర్ దినోత్సవ ర్యాలీని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ట్రేని కలెక్టర్ అమిత్ జిల్లా స్వైప్ అధికారి మల్లేశంలతో కలిసి ఆయన ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎంతో విలువైందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ప్రభుత్వాలను మార్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ తహసిల్దార్ లక్ష్మీనారాయణ వికారాబాద్ టౌన్ సిఐ టంగుటూరి శ్రీను, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ అమ్మ, కమిషనర్ జాకీర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement