Wednesday, May 22, 2024

RR: గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆగస్ట్ 24 (ప్రభ న్యూస్): గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నివాసంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఎన్ మౌనిక ఎంబీబీఎస్ లో ఎన్ మానస బీటెక్ లో ఉచిత సీట్లు సాధించిన సందర్భంగా శాలువా స్వీట్ తో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ… గిరిజన విద్యార్థులు ఎంబీబీఎస్ బీటెక్ లో ఫ్రీ సీటు సాధించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.

కృషి, పట్టుదల ఉంటే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని, ఇందుకు నిదర్శనం బూరుగుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ కూతురులని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు అనంతరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంబీబీఎస్ బీటెక్ లాంటి ఉన్నత శిఖరాలను చేరుకోవడం అందరికీ ఆదర్శనీయమన్నారు. రాబోయే రోజుల్లో వీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి జడ్పిటిసి మదికర్, మాజీ మార్కెట్ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మర్పల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement