Wednesday, May 1, 2024

కాంగ్రెస్ కి షాక్.. బిఆర్ ఎస్ లో చేరిన కార్పొరేటర్

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ బాలు నాయక్ భారాస తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే ఏకైక మనస్తత్వం మంత్రిదని.. అభివృద్ధి ఆమెకే సాధ్యమని భావించి నేడు పార్టీలో విలీనం అవుతున్నట్లు కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రా జగన్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్జున్, మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, కొ ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖలీల్ పాషా, గుండోజి రఘునందన్ చారి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి రామిరెడ్డి, బాలాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వొంగెటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, అత్తాపురం శ్రీనివాస్ రెడ్డి బలు నయక్, ,బొర్రా మాధవరెడ్డి సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement