Tuesday, July 23, 2024

RR: వరద బాధితుల కోసం పబ్లిక్ వాయిస్ ఫోరం ఆర్థిక సాయం

వికారాబాద్, ఆగస్టు 12 (ప్రభ న్యూస్): ములుగు జిల్లాలో సీతక్కతో కలిసి ముప్పు గ్రామాల్లో పబ్లిక్ వాయిస్ పోరం జిల్లా అధ్యక్షుడు పడిగళ్ళ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వేణు,శేఖర్ ట్రెజరర్ అరుణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, సలహాదారులు వై నర్సింలు, రాజు, తేజ పర్యటించారు. గతంలో పబ్లిక్ వాయిస్ పోరం ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయ నిధి సేకరించిన మొత్తం నిధి రూ.1,24,974లు గోవిందరావుపేట మండలంలో కర్లపల్లి చంద్రు తాండ ప్రాజెక్టు నగర్ గ్రామాల ప్రజలను కలిసి వస్తు రూపంలో, నగదు రూపంలో పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో అందజేశారు.

వరద బాధితుల కోసం సేకరించిన సహాయ నిధిని ప్రత్యక్షంగా సీతక్క సహకారంతో, ఆమె సూచనతో గ్రామాల్లో పర్యటించి పబ్లిక్ వాయిస్ బృందం వికారాబాద్ టీం సభ్యులు ప్రజలకు అందజేశారు. అదేవిధంగా వికారాబాద్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వారి సమస్యలపైన సీతక్కకి మెమొరాండంను పబ్లిక్ వాయిస్ తరపున సీతక్కకు అందజేయడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించి తన శక్తి మేరకు మున్సిపల్ ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్ కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement