Monday, May 6, 2024

TS : పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి… క‌లెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్, మార్చి 2 (ప్రభ న్యూస్): జిల్లాలో వివిధ దశల్లో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం టెలి కాన్ఫరెన్సు ద్వారా ప్రతి గ్రామ పంచాయతి బిల్డింగ్స్, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షేడ్స్ నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పూర్తి కాని పనులను సత్వరమే పూర్తి చేసి ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు.సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రతి రోజు టార్గెట్ పెట్టుకొని నాణ్యత తో పూర్తి చేసి పురోగతి లోకి తీసుకురావాలని ఆదేశించారు. మండలాల వారిగా సి సి రోడ్ల నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement