Friday, May 3, 2024

వార్డు అభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయించిన .. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ( ప్రభ న్యూస్) వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని11 వార్డు అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు కేటాయించినట్టు వికారాబాద్ ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం మీతో నేను కార్యక్రమం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు గ్రీటిపల్లి జాంబపూర్ తండా కొట్టం గట్టు తండాలలో ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక కౌన్సిలర్ అనిత అనంతయ్యతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానంగా విద్యుత్ సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తేగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని మున్సిపల్ అధికారులను సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం డబుల్ బెడ్ రూములు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అనిత అనంతయ్యతో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు.. అనంతరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి నాయకులు.. అనంతయ్య తూర్పు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement