Tuesday, April 30, 2024

పిడుగుప‌డి.. కాలిపోయిన ఈత చెట్టు

వికారాబాద్, (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. కాగా ఈత చెట్టు పై పిడుగు పడి ఈతచెట్టు కాలిపోయిన సంఘటన చోటు చేసుకుంది.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సాయి నగర్ లో గల ఈదచర్లపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఈతచెట్టు పూర్తిగా కాలిపోయింది సంఘటన చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధించిన దృశ్యాన్ని కొంతమంది తమ ఫోన్ల‌ల‌లో చిత్రీకరించారు. ఆదివారం భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ సూచన మేరకు కొంత ఎండలు తగ్గుముఖం ప‌ట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement