Tuesday, May 7, 2024

రంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం

రంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచరించింది. జిల్లాలోని యాచారం మండలం తాడిపత్రిలో చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో రెండు లేగదూడలపై చిరుత దాడి చేసినట్లు చెబుతున్నారు. చిరుత పులి సంచరిస్తుండడంతో స్థానికులు, గ్రామాల ప్రజలు ఎక్కడ ప్రజలపై దాడికి పాల్పడుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ప్రజలు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement