Monday, April 29, 2024

శంకర్ పల్లిలో పట్టుబడ్డ భారీ నగదు.. 80.88 లక్షలు స్వాధీనం

శంకర్ పల్లి (ప్రభ న్యూస్): తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రంగారెడ్డి జిల్లాలో త‌నిఖీలు ముమ్మ‌రం అయ్యాయి. శంకర్‌ప‌ల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఇంటర్ డిస్టిక్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. దీంతో బీడీఎల్ చౌరస్తాలో డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాల చెకింగ్ చేసే క్రమంలో 9,38, 730 రూపాయలు ఒక కారులో లభించాయి.

మరో సందర్భంలో సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ సాధారణ చెకింగ్ లో భాగంగా హైదరాబాద్ రోడ్డులోని గాయత్రి హాస్పిటల్ పరిసరాలలో మరో కారులో 71,50,000 రూపాయల నగదు లభించింది. ఈ నగదుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో ఈ రెండు చోట్ల లభించిన నగదును స్వాధీనం చేసుకుని ఇన్‌క‌మ్‌ టాక్స్ డిపార్ట్మెంట్ కు అప్ప‌గించినట్లు శంకరపల్లి ఎస్ హెచ్ఓ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement