Tuesday, May 7, 2024

నిరుద్యోగులకు శుభవార్త : ఇంద్రన్నమెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ

మహేశ్వరం నియోజకవర్గంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువత రానున్న పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన కోచింగ్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర టీఆర్ఎస్ యువ నాయకులు, ఇంద్రన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పి.కార్తీక్ రెడ్డి సహకారంతో ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూపు 3, గూపు 4 ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ కోచింగ్ ను నగరంలో పేరొందిన పీజేఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి.జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో అందజేయనున్నట్లు వెల్లడించారు. తుక్కుగూడలో ఇందుకు సంబంధించి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, మీర్ పేట్, పహడీషరీఫ్ పోలీసు స్టేషన్లలో దరఖాస్తు చేయాలని కోరింది. కోచింగ్ ఏప్రిల్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement