Friday, May 3, 2024

RR: 26న గృహలక్ష్మి చెక్కుల పంపిణీ … మంత్రి మల్లారెడ్డి

ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్, ఆగస్ట్ 22: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఈనెల 26న మేడ్చల్ నియోజకవర్గంలో 3 వేల మందికి గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల చొప్పున పంపిణీ చేయనున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీనికి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షత వహించగా, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలో దళిత బంధు సెకండ్ ఫేస్ పథకం కింద మేడ్చల్ నియోజకవర్గంలో 1,100 మందికి చెక్కులు పంపిణీ చేయనున్నట్టు కూడా మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా, మరి కొద్దిరోజుల్లో రెండవ విడత గృహలక్ష్మిని కూడా అమలు చేస్తామన్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు తమ తమ ప్రాంతంలో ప్రజలకు ప్రచారం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జెడ్పీ సీఈఓ దేవసహాయం, డిప్యూటీ డీఈవో సరిత, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement