Monday, April 29, 2024

Minister Seethakka: రామప్పను అభివృద్ధి చేస్తా.. ప‌నుల్లో వేగం పెంచండి..

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కృషిచేస్తాన‌ని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. ములుగు జిల్లాలో ఆమె ప‌ర్య‌టించారు.

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప రామలింగేశ్వరస్వామిని మంత్రి సీతక్క కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి పట్టువస్త్రాలను మంత్రికి అందజేసి ఆశీర్వదించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న టూరిజం భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించి మ్యాప్ ను పరిశీలించారు. అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement