Sunday, April 28, 2024

కొత్తగూడెంలో రాజీవ్​పార్క్ ప్రారంభం​.. పిల్లలతోపాటు పెద్దలకూ ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​

కొత్తగూడెంలో రాజీవ్​ పార్క్​ని మస్త్​ డెవలప్​ చేశారు. 25 లక్షల రూపాయలతో మోడ్రన్​గా దీన్ని తీర్చిదిద్దారు. అన్ని రకాల హంగులతో ఉన్న ఈ పార్క్​ని ఇవ్వాల (శనివారం) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్​ దురిశెట్టి అనుదీప్​ ప్రారంభించారు. పార్క్ లో అన్నిహంగులతో పిల్లలను, పెద్దలను అబ్బురపరిచే ఆహ్లాదకరమైన వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రీనరీ కూడా ఆకట్టుకునేలా, మనసుకు ప్రశాంతత కలిగించేలా ఉంది.

ఎంట్రన్స్ లో I love Rajeev Park అనే లైటింగ్ తో బోర్డు ఉంది. ఇంకా.. వాకింగ్ ట్రాక్​తో పాటు పెద్ద స్క్రీన్​ తో ఒక స్టేజీని ఏర్పాటు చేశారు. దీనిపై ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు ఏవేర్ నెస్ కలిగించేలా పలు కార్యక్రమాలు నిర్వహించొచ్చు. అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్ చూసేందులకు, సాంస్కృతిక కార్యక్రమాలు, బర్త్ డే ప్రోగ్రాముల కోసం కూడా ఈ స్క్రీన్​ ఎంతగానే ఉపయోగపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement