కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా దోస చేసి పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి కి పార్టీ నాయకులకు తినిపించారు. కరీంనగర్ నుండి శుక్రవారం బస్ లో జగిత్యాలకు బయలు దేరిన రాహుల్ మాల్యా ల క్రాస్ రోడ్డు వద్ద మొబైల్ టిఫిన్ సెంట్రర్ వద్ద ఆగి తానే స్వయంగా పెనం పై దోస వేశారు. రాహుల్ నాలుగు దోసెలు వేసిన రాహుల్ తానుకుడా కార్యకర్తలతో కలసి టిఫిన్ చేశారు. ఈ సందర్బంగా టిఫిన్ సెంటర్ నిర్వాహకునితో ముచ్చటించారు..
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/10/rahul-6-1024x819.webp)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/10/rahul-3-1-1024x760.webp)
అలాగే , మార్గ మధ్యలో కల్లు గీత కార్మికుల కనపడటంతో రాహుల్ బస్సు ఆపి వారి వద్దకు వెళ్లారు.. వారితో కరచాలన చేసి కష్టసుఖాలను ఆడిగి తెలుసుకున్నారు..
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/10/rahul-7-1024x907.webp)
అక్కడే ఉన్న గృహిణితో మచ్చటించారు.. ఆమె చేతిలో ఉన్న బాలుడిని ఆడించారు రాహుల్..
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/10/rahul-2-1-1024x682.webp)