Wednesday, July 24, 2024

Rahual Gandhi as a Chef – దోస వేసిన రాహుల్… క‌ల్లు గీత కార్మికులతో మాటామంతి…చిన్నోడుతో ముచ్చ‌ట్లు … ఫోటో స్టోరీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా దోస చేసి పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి కి పార్టీ నాయకులకు తినిపించారు. కరీంనగర్ నుండి శుక్రవారం బస్ లో జగిత్యాలకు బయలు దేరిన రాహుల్ మాల్యా ల క్రాస్ రోడ్డు వద్ద మొబైల్ టిఫిన్ సెంట్రర్ వద్ద ఆగి తానే స్వయంగా పెనం పై దోస వేశారు. రాహుల్ నాలుగు దోసెలు వేసిన రాహుల్ తానుకుడా కార్యకర్తలతో కలసి టిఫిన్ చేశారు. ఈ సందర్బంగా టిఫిన్ సెంటర్ నిర్వాహకునితో ముచ్చటించారు..

అలాగే , మార్గ మ‌ధ్యలో క‌ల్లు గీత కార్మికుల క‌న‌ప‌డ‌టంతో రాహుల్ బ‌స్సు ఆపి వారి వద్ద‌కు వెళ్లారు.. వారితో క‌ర‌చాల‌న చేసి క‌ష్టసుఖాల‌ను ఆడిగి తెలుసుకున్నారు..

అక్క‌డే ఉన్న గృహిణితో మ‌చ్చ‌టించారు.. ఆమె చేతిలో ఉన్న బాలుడిని ఆడించారు రాహుల్..

Advertisement

తాజా వార్తలు

Advertisement