Sunday, April 28, 2024

TS | జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు తెలంగాణ బిడ్డ

అశ్వాపురం, (ప్రభ న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని మల్లెల మడుగు గ్రామానికి చెందిన రాగం భవ్య శ్రీ జాతీయ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో భవ్యశ్రీ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైంది. కాగా, బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో మార్చి 10 నుంచి 14 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement