Wednesday, May 1, 2024

Modi: ఈనెల 26న శ్రీ‌వారి సన్నిధికి ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాని మోడీ ఈనెల 26న శ్రీ‌వారి స‌న్నిధికి రానున్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో తెలంగాణలోని వివిధ రాయకీయ సభల్లో మోదీ పాల్గొంటారు. తర్వాత తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం 26న తిరుమలకు వెళ్లబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం 26న సాయంత్రం దుండిగల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్తారు. తర్వాత రోడ్డు మార్గంలో రాత్రి 7:45కి తిరుమల చేరుకుంటారు.

రాత్రి అక్కడే ఉంటారు. 27న తెల్లారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఉదయం 9:30కి తిరుమల నుంచి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 11.30కి హకీంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మార్గదర్శకాల ప్రకారం టీటీడీ, పోలీసుశాఖ ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement