Monday, May 20, 2024

Warangal : ఓరుగల్లులో ప్రధాని మోడీ… భద్రకాళీ అమ్మవారికి పూజలు

వరంగల్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓరుగల్లు నగరానికి చేరుకున్నారు. హకీమ్ పేట నుండి వరంగల్ లోని మామూనూరు ఎయిర్ ఫోర్ట్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. నిర్ణీత సంఖ్యలోనే నేతలను అనుమతించారు. మామూనూరు ఎయిర్ ఫోర్ట్ నుండి వరంగల్ లోని శ్రీ భద్రకాలీ మాతను దర్శించుకునేందుకు బయల్దేరి వెళ్లారు.

భద్రకాళీ ఆలయంలో మోడీ పూజలు…

భారతదేశ ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ శ్రీ భద్రకాళి దేవాలయం అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మోడీకి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు. ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement