Sunday, April 28, 2024

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాక

నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహించే ‘ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్- 2024’ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపిస్తారు.

కన్హ శాంతివనంలో కార్యక్రమం పూర్తయ్యాక ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

అలాగే, రేపు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ డ్ విశిష్ట అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ నెల 17న ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు ఉండనున్నాయి.

ఇక, ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం-2024 గురువారం స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, హార్ట్ ఫుల్నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. .

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement