Friday, May 3, 2024

HYD: అధికారం మళ్లీ మనదే : మంత్రి కేటీఆర్

ఎల్బీనగర్, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తధ్యమని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బొక్క సదానంద్ రెడ్డి ఆతని మిత్ర బృందం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చేరిన వారు మాట్లాడుతూ… ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, శాసనసభ్యులు సుధీర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరిక కావడం జరిగిందని తెలిపారు. మేము సైతం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయానికి ముందుండి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కార్తిక్ రెడ్డి, ముద్ద పవన్ తో పాటు పార్టీలో చేరిన చందు, మనీష్, హకీమ్, అంజి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement