Tuesday, April 30, 2024

KNR : క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఓటు వేసిన రాజ‌కీయ నాయ‌కులు, అధికారులు

కరీంనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రణాళిక సంఘం ఉపాఢ్యక్షుడు బోయింపపల్లి వినోద్ కుమార్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం 159 లో ఓటు హక్కును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , వారి కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు
ఓటర్లు అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో కరీంనగర్​ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓటు వేశారు.

కరీంనగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ః

- Advertisement -

పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్నం గం. 1-00 వరకు నమోదు అయిన పోలింగ్ శాతం వివరాలు:

23- రామగుండం ….. 38.79%
24- మంథని ….. 51.40%
25- పెద్దపల్లి ….. 39.00%

వీణవంక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న బిఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement