Tuesday, May 7, 2024

ట్యాంక్ బండ్ పై ష‌ర్మిల దీక్ష భ‌గ్నం..

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని ష‌ర్మిల ట్యాంక్ బండ్ పై చేస్తున్న దీక్ష‌ను పోలీసులు భ‌గ్నం చేశారు. ఇటీవల వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించిన విష‌యం విధిత‌యే.

పాదయాత్ర కోసం మరోసారి షర్మిల పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. పాదయాత్రకి అనుమతి తిరస్కరించారు పోలీసులు. షర్మిల పాదయాత్ర వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు పాదయాత్రకి అనుమతి నిరాకరించడంతో ఆమె హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి.. అక్కడే నిరసన దీక్ష చేపట్టారు. తన పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వైయస్ షర్మిల.

Advertisement

తాజా వార్తలు

Advertisement