Friday, May 17, 2024

రేవ్ పార్టీని భ‌గ్నం చేసిన పోలీసులు.. అదుపులో 37మంది.. ముగ్గురు ప‌రార్

ఒక‌ప‌క్క పోలీసులు ఎంత‌కాప‌లాలు కాస్తున్న రేవ్ పార్టీలు జ‌రుగుతునే ఉన్నాయి. కాగా హైద‌రాబాద్ శివారులో రేవ్ పార్టీని భగ్నం చేసి.. 37 మందిని అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. 34 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు గంజాయి అమ్మకం దారులను అదుపు తీసుకున్నారు పోలీసులు. అయితే.. బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న విద్యార్థులతో పాటు.. విద్యార్థులకు గంజాయి సప్లై చేసినా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల రేవ్ పార్టీకి అనుమతించిన సన్నీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..

హైదరాబాదులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులే నిర్వాకులుగా మారి.. ఎంజాయ్ మెంట్ పేరు తో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే.. అర్ధరాత్రి వచ్చిన సమాచారంతో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు.రేవ్ పార్టీలో లు పాల్గొన్న విద్యార్థులను అదుపులో తీసుకొని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే.. హయత్ నగర్ బర్త్ డే పార్టీ కేసు లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.బర్త్ డే పార్టీ నిర్వహించారు విద్యార్థులు. అయితే.. పసుమాముల విలేజ్ లో ఉన్న ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ లో బర్త్ డే పార్టీ చేసుకున్నారు 33 మంది విద్యార్థులు. 10 కార్లు, 30 మొబైల్ ఫోన్స్, ఒక బైక్, 50 గ్రామూల గంజా, 8 సిగరెట్లు, లిక్కర్ బాటిల్స్, DJ సౌండ్ సిస్టమ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి దొరికిన ముగ్గురు విద్యార్థులపై కేస్ నమోదు పోలీసులు.. సాయి చరణ్ రెడ్డి(19),హిమ చరణ్ రెడ్డి(20),విశ్వ చరణ్ రెడ్డి(20) పై కేసు నమోదు చేశారు. అయితే.. పరారీలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement