Friday, May 3, 2024

TS: బాన్సువాడలో జెండాను ఆవిష్కరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, జనవరి 26 ప్రభ న్యూస్ : బాన్సువాడలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి జెండావిష్కరణ చేశారు.

ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో భుజంగరావు, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు డి. అంజిరెడ్డి‌, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామి రెడ్డి, జడ్పిటిసి పద్మా గోపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఎర్వల కృష్ణా రెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు, ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement