Sunday, April 28, 2024

NZB: ప్రేరణనే ప్రాణపదంగా పయనిద్దాం.. జిల్లా జడ్జి

నిజామాబాద్, మార్చి 22 (ప్రభ న్యూస్): సమాజంలో అందరి జీవన హక్కులు గౌరవిస్తు గౌరవప్రదమైన జీవనగమనాన్ని కొనసాగించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ లు వ్యాఖ్యానించారు. పొక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, సైబర్ క్రైమ్, తదితర చట్టాలపై రూపొందించిన లఘుచిత్రం అద్భుతమైన కళాఖండమని వారు విశ్లేషించారు. నేరాలు, శిక్షలు, సంస్కరణలు, నేర బాధితులకు పరిహారం, న్యాయ సహాయం, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సామాజిక సేవ తదితర అంశాలపై చిత్రంలో చిత్రీకరించిన తీరును వారు అభినందించారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రూపొందించిన లఘుచిత్రాన్ని వారు ఉషా మల్టీప్లెక్స్ లో వీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

బాలలపై ఏ రకమైన హింసనైనా, అఘాయిత్యానైనా అరికట్టడానికి పౌరసమాజ సహకారం చాలా అవసరమని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. బాలల సంరక్షణ, పోషణ, రక్షణకు చట్టం పూర్తి రక్షణగా నిలబడుతుందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ… బాల్యవివాహాలు, బాలలతో కూలీ పని చేయించడం, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం అవిరాల కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.

క్రిమినల్ నేరాల్లో బాధితులైన వారికి జిల్లా అధికార యంత్రాంగం తగిన పరిహారం అందిస్తూ అండగా నిలబడుతున్నదని కలెక్టర్ తెలిపారు. నేరమయ సంస్కృతిని అంతం చేయడంలో పోలీసుశాఖ శ్రమిస్తున్నదని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నింగేనవార్ అన్నారు. బాలల, మహిళల భద్రతకు ప్రత్యేక విభాగాలు విధులు నిర్వహిస్తుయని తెలిపారు. ప్రేరణ లఘుచిత్రం వీక్షణ కార్యక్రమంలో న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, న్యాయవాదులు, పరాలీగల్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement