Tuesday, April 30, 2024

మద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ హల్ చల్.. దాడి చేశాడని ఫిర్యాదు

నిజామాబాద్ (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ ఎదురుగా ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో స్కూటీపై వెళ్లుతూ.. కారులో వెళ్లుతున్న వారిపై దాడి చేశాడు. నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం గేటు ముందే ఆదివారం రాత్రి ఇది జరిగింది.

ఏఆర్ కానిస్టేబుల్ ఆయూబ్ స్కూటీపై వెళ్లుతుండగా కారులో సాయి తేజ ఫ్యామిలీతో అటువైపు వెళ్లుతున్నారు. స్కూటీని కారు ఢీకొట్టిందని కారును ఆపి వారి నుంచి బలవంతంగా ఆర్సీ తీసుకున్నారు.

- Advertisement -

కారులో ఉన్న మహిళలు కానిస్టేబుల్ ను బతిమిలాడిన వినిపించుకోలేదు. అంతే కాకుండా కారులో ఉన్న వారిపై దురుసుగా ప్రవర్తించి, దాడి చేశాడనీ బాధితులు ఆరోపించారు. సీపీ కార్యాలయం ఎదుట ఆరగంట పాటు ఈ తతంగం జరిగినా అక్కడి పోలీసులు పట్టించుకో లేదు. ఒకటవ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లుతుండగా పోలీసు వాహనం అపి అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఏఆర్ కానిస్టే బుల్ ఆయూబ్ నుంచి ఆర్సీ తీసుకొని కారులో ఉన్న వారికి ఇచ్చారు.

అక్కడి నుంచి ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయగా మద్యం సేవించాడని ఎస్ హెచ్ వో తెలిపారు. బాధితులు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యా దు చేశారు. అంతేకాకుండా సిపి కార్యాలయం ఎదుట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి విచా రణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement