Sunday, May 5, 2024

NZB | పసుపు రైతుల కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ : ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : పసుపు రైతుల కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ అని ధర్మపురి అరవింద్ అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ పసుపు బోర్డును ప్రకటించారన్నారు. పసుపు ధర రూ.20వేలు దాటిస్తానని, అప్ప టి వరకు నిద్రపోను అని అన్నారు. నిజామాబాద్ నగరం లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడి దినేష్ కులా చారి ప్రమాణ స్వీకార కార్య క్రమానికి ఎంపీ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిలుగా హాజర య్యారు. ముఖ్య అతిథుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి ప్రమాణ స్వీ కారం చేశారు.

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ… అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఈ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. ఆ రాముని ఆశీస్సులు దినేష్ కులాచారిపై ఉంటాయన్నారు. దినేష్ అధ్యక్ష సమయంలో వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్విప్ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కులాచారిని.. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ను ఆర్వింద్ ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement