Tuesday, April 16, 2024

ఛత్రినాక పేలుడు కేసులో కొత్త ట్విస్ట్

హైదరాబాద్ ఛత్రినాక పేలుడు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. టపాసులతో పాటు కెమికల్ పెట్టి మరీ యువకులు పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. గుంతలో టపాసులు పెట్టి, దానితో పాటు కెమికల్స్ మిక్స్ చేశారు. గుంతలో కెమికల్స్, టపాసులు కలవడంతో పేలుడు జరిగింది. క్లూస్ టీమ్స్‌తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఛత్రినాక పరిధిలోని కందికల్ గేట్ సమీపంలోని పీవోపీ విగ్రహ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాధ్ (30) మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి. బాణసంచా తయారీ కారణంగానే ఈ పేలుడు సంభవించిందని భావించారు. అయితే, టపాసులతో పాటు కెమికల్ పెట్టి పేల్చినట్టు పోలీసులు తేల్చారు.

ఇది కూడా చదవండి: దేశంలో రూ.60 కే లీట‌ర్ పెట్రోల్ ?

Advertisement

తాజా వార్తలు

Advertisement