Sunday, May 5, 2024

ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మకమైన విద్య : మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి : ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మకమైన విద్యను భోధిస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలం తుక్కాపురం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్బంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టి, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కృష్ణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement