Friday, April 26, 2024

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేటు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల నుండి వివిధ శాఖలకు సంబంధించిన 32 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్ర‌జలు అందించిన ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖ 26, మున్సిపాలిటీ 2, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఎక్సైజ్ శాఖ, బి.సి. వెల్ఫేర్, ధరణి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 32 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, కలెక్టరేట్ ఎ.ఓ. నాగేశ్వర చారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement