Friday, May 3, 2024

NLG: డప్పులు, బోనాలతో పంచాయతీ కార్మికుల వినూత్న నిరసన

మోత్కూర్, ఆగస్టు 4 (ప్రభ న్యూస్) : గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో భాగంగా శుక్రవారం 30వరోజు డప్పులు, బోనాలతో మెడలో పూలదండలు వేసుకొని వినూత్నంగా నిరసన తెలుపుతూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కారొబార్, బిల్ కలెక్టర్ లను పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని, వేతనాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సూరారం భాస్కర్, నాయకుడు మరిపెళ్లి బంగారు, కృష్ణ, సుదర్శన్, బిక్షమయ్య, సైదులు, ఎల్లమ్మ, బుగ్గమ్మ ,లక్ష్మి,శివరాజ్, అంజయ్య, సోమయ్య, యాదయ్య, ధనుంజయ్, స్వామి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement