Friday, May 17, 2024

చిన్న మ‌ట‌న్ ముక్క ప్రాణం తీసేసింది…

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ..ఎప్పుడే తినే మాంసాహారమే అది అతని పాలిట మృత్యుదేవత అయ్యింది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. వివ‌రాల‌లోకి వెళితే,మహబూబ్‌నగర్ జిల్లా కోనాపురానికి చెందిన ముత్తయ్య ఎంతో సంతోషంగా కొడుకుతో కలిసి భోజనం చేస్తున్నాడు. అంతలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నీళ్లు తాగినా బ‌యట‌కు రాలేదు.. లోప‌లికి పోలేదు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అయితే ఊపిరాడక ముత్తయ్య చనిపోయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.. ముత్తయ్య మరణంతో కుటుంబం విషాదంతో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement