Sunday, April 28, 2024

TS : అభివృద్ధికి, సంక్షేమానికి మోదీ ప‌ర్యాయ‌ప‌దం… కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి…

కరోనా వచ్చినప్పుడు మన ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోదీ అని.. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారన్నారు బిజెపి రాష్ర్ట అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో నుంచి ఈరోజు వరకు ఉచిత బియ్యం ఇచ్చారని చెప్పారు.

తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో ఓపెన్ టాప్ జీప్ లో నేడు ఆయ‌న ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, డిపాజిట్స్ లేకుండా పొదుపు సంఘాలకు 20లక్షల రుణాలు ఇచ్చామ‌ని.. మళ్లీ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘ‌న‌త మాదేన‌న్నారు. ముస్లిం బిడ్డలకు మోదీ అండగా నిలిచి.. ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని అంటూ ముస్లిం ఆడబిడ్డల మీద కత్తిలాగా ట్రిపుల్ తలాక్ ఉండేదన్నారు. మళ్లీ ముస్లిం మహిళలను ప్రమాదంలోకి నెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. 500 ఏళ్ల నుంచి రామ జన్మభూమి నిర్మాణం హిందువుల కలగా ఉండేదని.. మోదీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారం అయ్యిందన్నారు. ఎయిర్‌పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు కిషన్ రెడ్డి. చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి మోడీ లోన్స్ ఇస్తున్నారని.. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి.. ప్రపంచంలో దేశ గౌరవాన్ని పెంచారని చెప్పారు. మూడో సారి మళ్లీ మోడీనే ప్రధాని కాబోతున్నారని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement