Friday, April 26, 2024

మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటా…ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్) : మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటాన‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126వ‌ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ బీ బ్లాక్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ను క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తమ కాలనీలో డ్రైనేజీ అభివృద్ధి, మిగిలిన సీసీ రోడ్లు, కమిటీ హాల్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్పందిస్తూ కాలనీ అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. అంజయ్య నగర్ బీ బ్లాక్ లో కమిటీ హాల్ తో పాటు మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సురేందర్, వైస్ ప్రెసిడెంట్ సోమేశ్వర్, జెనరల్ సెక్రెటరీ రాజ్ మహేందర్, మహిళలు జయశ్రీ, బాల లక్ష్మీ, రాధ, కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement