Friday, May 24, 2024

NZB: నామినేషన్ దాఖలు చేసిన మంత్రి వేముల…

భీంగల్ టౌన్, నవంబర్ 6 (ప్రభ న్యూస్) : బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వేల్పూర్ లోని తన స్వగ్రామంలోని పెద్దమ్మ గుడిలో తన సతీమణి వేముల నీరజ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వేల్పూర్ నుండి బస్సులో భీంగల్ చేరుకున్న మంత్రి వేముల నామినేషన్ దాఖలు చేశారు.

తన సతీమణి వేముల నీరజ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేతిరెడ్డి సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, హెల్త్ అండ్ వెల్ఫేర్ చైర్మన్ మధుశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ లతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిత్ర మిశ్రా కు అందజేశారు. అనంతరం వేముల మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, మూడోసారి తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement