Monday, April 29, 2024

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెద్ద దిక్కుగా.. మంత్రి వేముల

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్న బాల్కొండ నియోజకవర్గంలోని నిరుపేద ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు వైద్య సహాయం కోసం కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. అనారోగ్యం బారినపడి వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా మంత్రి వేముల అండగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇటీవల ఎంతో మందికి ఆర్ధిక సహాయం అందజేస్తూ మనో ధైర్యం చెప్తూ వస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన సంపత్ చేతికి సర్జరీ అవసరం ఉండటంతో నిమ్స్ లో సర్జరీ కొరకు LOC మంజూరు చేయాలని మంత్రి ని కోరగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సి.ఎం సహాయ నిధి నుండి 70000 LOC మంజూరు చేసి ఈ రోజు వారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా బాధితుడు మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement