Saturday, May 4, 2024

TS: ధర్మపురి ఎమ్మెల్యేను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌ను మంత్రి శ్రీధర్ బాబు యశోద హాస్పిటల్‌లో కలిసి పరామర్శించారు. అలాగే వైద్యులతో మాట్లాడి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు ధైర్యంగా ఉండాలని మంత్రి కోరారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితంలోకి రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.

కాగా మూడు రోజుల ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మన్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే సికింద్రబాద్ లోని యశోద ఆస్పత్రిలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement