Monday, April 29, 2024

TS : రాములోరి సన్నిధిలో మంత్రి పొన్నం

ఇల్లందకుంట, ప్ర‌భ‌న్యూస్ః అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారాములను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మోక్కులు చెల్లించారు.

- Advertisement -

అనంతరం మాట్లాడుతూ సీతారాములు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నామన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయం వద్ద భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement