Tuesday, April 30, 2024

TS: ప్రైవేట్ వైద్యశాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ఘట్కేసర్, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన నీలిమ వైద్యశాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, రెడ్యానాయక్, అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రామచంద్రం, ఎస్.నీలిమ, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ నీరుడి రామారావు, బోయపల్లి బ్రదర్స్ సత్తిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కెఎం రెడ్డి, నీరుడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement