Thursday, April 25, 2024

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత : ఎమ్మెల్యే జీఎంఆర్‌

పటాన్ చెరు : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప‌టాన్ చెరు నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలను శుక్రవారం ఉదయం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాజ్యోతి వెలిగించి లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ లాంటి వినూత్న పథకాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీపై రుణాలు అందించడంతోపాటు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం అందిస్తున్నారని అన్నారు. ఎంపీపీగా ఉన్నప్పటినుండి నేటి వరకు మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మహిళ ఉద్యోగినులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement