Sunday, May 12, 2024

పండగ వేళ విషాదం.. పతంగులు ఎగరేస్తూ ఒకరు మృతి

జోగిపేట, (ప్రభన్యూస్) : సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా పిల్లలతో కలిసి సరదాగా బంగ్లాపై గాలిపటం ఎగురవేస్తుండగా బంగ్లా పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైరుపై గాలిపటం పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం ఇలా ఉన్నాయి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కోరగంటిపాలెం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (35) సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారి ఊరు జోగిపేటకు వచ్చాడు. త‌న పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తుండగా గ్లా పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుంది. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో సుబ్రహ్మణ్యం భవనం పైనుంచి కింద పడిపోయాడు.

ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండంగా మార్గ మధ్యలోనే సుబ్రహ్మణ్యం మృతి చెందారు. మృతుడు సుబ్రహ్మణ్యంకు భార్య చాముండేశ్వరి దేవి, పిల్లలు సుశాంత్ (5), దేవన్స్ (3) ఉన్నారు. సుబ్రహ్మణ్యం భార్య చాముండేశ్వరి దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement